27.7 C
Hyderabad
April 20, 2024 00: 10 AM
Slider హైదరాబాద్

ఆగస్టు 9 నుండి బీజేపీ అధ్య‌క్షుడి పాదయాత్ర  ప్రారంభం…!

#bandi sainjai

వ‌చ్చే నెల తొమ్మిది నుంచీ  తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు,క‌ రీంన‌గ‌ర్  ఎంపీ బండి సంజ‌య్ కుమార్ త‌న పాద‌యాత్ర ను ప్రారంభించనున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర పార్టీ నేత‌ల‌తో హైద‌రాబాద్ లోని నాంప‌ల్లి పార్టీ రాష్ట్ర ఆఫీసులో స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సందర్భంగా అద్య‌క్షుడు  బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో‘క్విట్ ఇండియా’ నాటి పరిస్థితులే నెలకొన్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఎండగట్టి ‘ప్రజా స్వామిక తెలంగాణ’ ఏర్పాటు లక్ష్యంగా పాదయాత్ర చేప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించారు.

కేసీఆర్ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే కోస‌మే తానీ పాదయాత్ర చేప‌డుతున్న‌ట్టు తెలిపారు.

ఆగ‌స్టు 9వ తేదీన హైద‌రాబాద్ లోని పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుండే పాదయాత్ర ప్రారంభం అవుతుందున్నారు.ఈ మేర‌కు పాదయాత్ర విజయవంతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీనియర్ నేతల నుండి  అభిప్రాయాలు కోరారు… బండి సంజయ్ కుమార్.

ఈ స‌మావేశానికి  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె.అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్మణ్,, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి,పేరాల శేఖర్ రావు,ఎంపీ సోయం బాపూరావు, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, చంద్రశేఖర్, సుద్దాల దేవయ్య, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎంపీలు విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే రఘు నందన్ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి   దుగ్యాల ప్రదీప్  కుమార్, బంగారు శ్రుతి,  మంత్రి శ్రీనివాసులు,తదితరులు పాల్గొన్నారు.

Related posts

[Professional] > Can The Doctors Prescribe Weight Loss Pills Keto Supplements Weight Loss 2 Week Weight Loss Pills

Bhavani

రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టి.యన్. ఎస్.ఎఫ్. నిరసన

Satyam NEWS

ఐదు రోజులు పాటు బ్యాంకులు బంద్

Satyam NEWS

Leave a Comment