39.2 C
Hyderabad
March 29, 2024 16: 31 PM
Slider మహబూబ్ నగర్

అమ్మడానికి రాజావారు ఎవరూ? కొనడానికి చైర్ పర్సన్ భర్త ఎవరు?

#bjpkollapur

అధికార పార్టీ మున్సిపల్ చైర్మన్ భర్త ప్రభుత్య స్థలాలను కబ్జా చేస్తున్నాడని బీజేపీ పార్టీ నేతలు శుక్రవారం ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ భర్త ప్రభుత్య స్థలాలను కబ్జా చేస్తున్నారని బీజేపీ పార్టీ నేతలు సాయికృష్ణ గౌడ్, జిల్లెల శివుడు, శేఖర్ గౌడ్, ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  రాజా బంగ్లా దగ్గర 20 పిట్ల రోడ్డును కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని అన్నారు.  గత కొన్ని ఏండ్ల నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్న రోడ్డును రాజా వారు ఎట్లా అమ్ముతారని, రోడ్డును విక్రయించడానికి ఓ ప్రజాప్రతినిది భర్త ఉంది ఎట్లా కొంటారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. 

కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్య స్థలాలను కాపాడాల్సిన నాయకులే భక్షకులు అవుతున్నారని ఆరోపించారు. గత కొన్ని ఏండ్ల క్రితం బస్ డిపో వెనకాల కృష్ణడి గుడి సమీపంలో పేద ప్రజలకు ప్లాట్లు ఇస్తే వాటిని కూడా అధికార పార్టీ నాయకులు కబ్జా చేసి అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సర్వే నెంబర్ 82 లో అక్రమంగా ఓ వ్యక్తికి కబ్జా చేసిన వెనక ఎవరు ఉన్నారని, వెంటనే బయట పెట్టాలని అధికార పార్టీ నేతలకు సవాల్ విసిరారు.  మున్సిపల్ చైర్మన్ భర్త ప్రెస్ మీట్ లో అన్ని అబద్దాలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రోడ్డును అక్రమించుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 

అధికార పార్టీ నేతలు అధికార దాహంతో కబ్జాలకు పాల్పడ్డాడం పై ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి స్పందించాలని, వెంటనే మున్సిపల్ చైర్మన్ భర్త పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు అక్రమంగా రోడ్డు ఆక్రమించి నిర్మించిన కట్టడాని కూల్చివేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

Related posts

కరోనా పై అవగాహన కల్పించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి

Bhavani

మంత్రాలయం పీఠాధిపతికి విశ్వహిందూ పరిషత్ ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment