రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై అధికార వైసిపి నాయకులు దాడులు చేస్తున్నారని ఏపీ బిజవెపి నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి వారు ఫిర్యాదు చేశారు. కేంద్రం నుంచి నేరుగా హోం శాఖ ప్రధాన కార్యదర్శిని ఏపీ లో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని బిజెపి నేతలు కేంద్ర హోం శాఖ మంత్రిని కోరారు.
హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన వారిలో బిజెపి నేత కిలారు దిలీప్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు తదితరులు ఉన్నారు. తమ ఫిర్యాదుపై అమిత్ షా సానుకూలంగా స్పందించారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బిజెపి నేతలు తెలిపారు.