ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు, నాయకుల మీద దాడులు చేసే సంస్కృతిని బీజేపీ సహించదని కడప జిల్లా రాజంపేట కు చెందిన రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ట్విటర్ వేదికగా ఖండించారు.
ఆంధ్ర రాష్ట్రంలో ఏకకాలంలో పలు తెలుగుదేశం కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తల దాడులనేపధ్యంలో ఆయన స్పందించారు.ప్రతిపక్షాలు చేసే విమర్శలను సహించలేని మనస్తత్వం ప్రజాస్వామ్యానికి చేటని,రాజరికంలో లేము అన్న విషయం వైసీపీ మరచిపోతుందని అన్నారు.