చరిత్రలో చాలా మంది పోలీసులను అడ్డుపెట్టుకొని రాజ్యాధికారాన్ని కాపాడుకోవాలని చేసిన ప్రయత్నాలు వికటించి ప్రతిపక్షంలో కూర్చున్న విషయాన్ని సియం జగన్ మరచిపోవద్దని భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ ప్రభుత్వం నేడు రాష్ట్రంలో విద్యార్థులు, యువజన సంఘాలు చేస్తున్న ప్రజా ఉద్యమాలను సహించలేక పోతోందని ఆయన అన్నారు. లాఠీలు, తూటాలతో విద్యార్థి, యువజన ఉద్యమాలను ఆపలేరని, ఇది చరిత్ర చెబుతున్న నిజమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో బిజెపి యువమోర్చా కార్యకర్తలపై పోలీసుల చర్యను, వ్యవహరించిన తీరును రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన అన్నారు.