34.2 C
Hyderabad
April 23, 2024 12: 04 PM
Slider కడప

వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్న రాష్ట్ర పోలీసులు

#vishnu 20

ఉప ఎన్నిక జరిగిన కడప జిల్లా బద్వేల్ లో పోలీసులకు, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ మాత్రం తేడా కనిపించలేదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్. విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా వైసిపి పార్టీకి సహకరిస్తున్నారని ఆయన అన్నారు. నాడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఏ రకంగా దొంగ ఓట్లు వేశారో దాన్నే బద్వేలులో పునరావృతం చేశారని ఆయన అన్నారు. పోలీసులులే దొంగ ఓట్లను ప్రోత్సహించడం సిగ్గుచేటని ఆయన తీవ్రంగా విమర్శించారు. దొంగ ఓట్లతో గెలిచేది.. ఓ గెలుపేనా ? అని ఆయన ప్రశ్నించారు. బద్వేల్ లో వైకాపా నాయకులు చేస్తున్న అరాచకాలపై అధికారులందరికీ పదే పదే ఫిర్యాదుచేసినప్పటికీ, చేస్తామన్న మాటలే కానీ, చర్యలుతీసుకుని ప్రజలలో విశ్వాసాన్ని నింపిన దాఖలాలు లేవని ఆయన అన్నారు.

Related posts

ఓటర్లకు డబ్బులు పంచే పార్టీలను రద్దు చేయాలి

Satyam NEWS

పంట పొలాల్లో మహిళ మృతదేహం

Bhavani

ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

Sub Editor

Leave a Comment