ఉప ఎన్నిక జరిగిన కడప జిల్లా బద్వేల్ లో పోలీసులకు, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ మాత్రం తేడా కనిపించలేదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్. విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా వైసిపి పార్టీకి సహకరిస్తున్నారని ఆయన అన్నారు. నాడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఏ రకంగా దొంగ ఓట్లు వేశారో దాన్నే బద్వేలులో పునరావృతం చేశారని ఆయన అన్నారు. పోలీసులులే దొంగ ఓట్లను ప్రోత్సహించడం సిగ్గుచేటని ఆయన తీవ్రంగా విమర్శించారు. దొంగ ఓట్లతో గెలిచేది.. ఓ గెలుపేనా ? అని ఆయన ప్రశ్నించారు. బద్వేల్ లో వైకాపా నాయకులు చేస్తున్న అరాచకాలపై అధికారులందరికీ పదే పదే ఫిర్యాదుచేసినప్పటికీ, చేస్తామన్న మాటలే కానీ, చర్యలుతీసుకుని ప్రజలలో విశ్వాసాన్ని నింపిన దాఖలాలు లేవని ఆయన అన్నారు.
ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి