31.2 C
Hyderabad
April 19, 2024 05: 23 AM
Slider హైదరాబాద్

జి హెచ్ ఎం సి అధికారులను నిలదీసిన కార్పొరేటర్ శ్రీవాణి

#bjphyderabad

టి అర్ ఎస్ ప్లీనరీ సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని జి హెచ్ ఎం సి అధికారులను రామంతాపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణీ వెంకట్ రావు నిలదీశారు.

గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర కోసం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన తనకు రూ.80 వేల జరిమానాను విధించిన జి హెచ్ ఎం సి అధికారులకు టి అర్ ఎస్ ఫ్లెక్సీలు కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు.

అధికార పార్టీకి  ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీలకు ఒక న్యాయమా? అని అమె ధ్వజమెత్తారు. ఈ విషయంలో టి అర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె టి అర్ తగు రీతిలో స్పందించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆమె హెచ్చరించారు.

Related posts

సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

నాందేడ్ లో సీయం కేసీఆర్ స‌భకు భారీ ఏర్పాట్లు

Bhavani

యాజిటేషన్: అమరావతి ఉద్యమానికి కదలిరండి

Satyam NEWS

Leave a Comment