కడప జిల్లా రాజంపేట కు చెందిన రాష్ట్ర బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ద్రోహి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు.
కృష్ణా బోర్డును కర్నూలులో కాకుండా వైజాగ్ తరలించాలని కేంద్ర మంత్రికి ఉత్తరం రాయడం తో జగన్ మీదవున్న భ్రమలు తొలగి పోయాయి అన్నారు. రాయల సీమ ప్రజలు జగన్ మోహన్ రెడ్డి కి 49 సీట్లలో ఏకపక్షంగా గెలిపించినందుకు నమ్మక ద్రోహం చేసాడన్నారు.
దీనిపై చేవ చచ్చిన MLA,MPలు నోరుమెదపడం లేదని విమర్శించారు. సీమ ఉద్యమకారులు ఏ నేపథ్యం అడ్డువచ్చి కలుగులో దాక్కున్నారని ప్రశ్నించారు. కృష్ణా బోర్డును కర్నూల్ లో ఉంచాలి లేదా విజయవాడలో ఉంచాలని సంబంధంలేని వైజాగ్ కు తరలించడం కరెక్ట్ కాదన్నారు. ఇందుకు బీజేపీ వ్యతిరేకం అన్నారు.