33.2 C
Hyderabad
April 25, 2024 23: 23 PM
Slider నిజామాబాద్

వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

#EndelaLaxminarayana

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే నాయకులు వాగులపై వంతెనలు కూడా నిర్మించలేకపోతున్నారని బిజెపి నాయకుడు ఎండెల లక్ష్మీనారాయణ అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో నేడు ఆయన పర్యటించారు.

గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జుక్కల్ నియోజకవర్గం అతలాకుతలమైన విషయం తెలిసిందే. నష్టపోయిన పంటలతో పాటు కొట్టుకుపోయిన రోడ్లను పరిశీలించిన ఆయన ఇటువంటి అరకొర అభివృద్ధినే టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందని ఘాటుగా విమర్శించారు.

బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ పుల్కల్ మధ్యలో నిర్మిస్తున్న వారధి జుక్కల్ మండలంలోని పెద్దఎడిగి వద్ద నిర్మిస్తున్న వారధి పనులకు గత నాలుగేళ్ల నుండి ఎందుకు ఆగాయో తెలపాలని ఆయన ప్రశ్నించారు.

అనంతరం ఆయా గ్రామాలలో సోయా’ కంది,వరి పంటలను పరిశీలించిన ఆయన వెంటనే ప్రభుత్వం అధికారుల చేత సర్వేలు చేయించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

లేకపోతే బిజెపి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మాజీ శాసనసభ్యురాలు అరుణతార నియోజకవర్గ బిజెపి నాయకులు ఉన్నారు.

Related posts

పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు షురూ

Satyam NEWS

రోడ్ల దుస్థితి పై డిజిటల్ వేదిక గా జనసేన ఉద్యమం

Satyam NEWS

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం

Satyam NEWS

Leave a Comment