కరోనా కష్టకాలంలో రోగులతో వ్యాపారం చేస్తూ రోగుల నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటున్న హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, బిజెవైఎం ఆందోళన చేశాయి.
మలక్ పేట్ లోని యశోదా ఆసుపత్రి వద్ద బిజెపి, బిజెవైఎం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. కోవిడ్ నిబ్బందనలు, చట్టాలకు విరుద్దంగా కరోనా రోగుల నుంచి యశోదా ఆసుపత్రి వారు 15 లక్షల నుంచి 50 లక్షలు గుంజుతున్నారని వారు ఆరోపించారు.
యశోదా ఆసుపత్రి యాజమాన్యం అన్ని నిబంధనలు అతిక్రమిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు తెలిపారు. అక్రమ వ్యాపారం చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలను దోచుకుంటున్న యశోద ఆసుపత్రి ని వెంటనే సీజ్ చేయాలంటు బీజేపీ, బీజేవైయం నాయకుల చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
బిజెపి, బిజెవైఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు.