28.7 C
Hyderabad
April 24, 2024 03: 49 AM
Slider హైదరాబాద్

రోగుల్ని పీడిస్తున్న యశోదా ఆసుపత్రి వద్ద బిజెపి ధర్నా

#Yasoda Hospital

కరోనా కష్టకాలంలో రోగులతో వ్యాపారం చేస్తూ రోగుల నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటున్న హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, బిజెవైఎం ఆందోళన చేశాయి.

 మలక్ పేట్ లోని యశోదా ఆసుపత్రి వద్ద బిజెపి, బిజెవైఎం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. కోవిడ్ నిబ్బందనలు, చట్టాలకు విరుద్దంగా కరోనా రోగుల నుంచి యశోదా ఆసుపత్రి వారు 15 లక్షల నుంచి  50 లక్షలు  గుంజుతున్నారని వారు ఆరోపించారు.

యశోదా ఆసుపత్రి యాజమాన్యం అన్ని నిబంధనలు అతిక్రమిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు తెలిపారు. అక్రమ వ్యాపారం చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలను దోచుకుంటున్న యశోద ఆసుపత్రి ని  వెంటనే సీజ్ చేయాలంటు బీజేపీ, బీజేవైయం నాయకుల చేసిన ఆందోళన  ఉద్రిక్తతకు దారి తీసింది.

బిజెపి, బిజెవైఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు.

Related posts

మొక్కలు నాటిన హీరోయిన్ నభా నటేష్

Satyam NEWS

పారద‌ర్శ‌కంగా హెడ్ కానిస్టేబుల్ స్థాయి నుంచీ బ‌దిలీలు…  !

Satyam NEWS

జగన్ ను నమ్ముకుంటే పదవులకు కొదవ లేదు

Satyam NEWS

Leave a Comment