28.7 C
Hyderabad
April 24, 2024 06: 27 AM
Slider నల్గొండ

మేళ్లచెరులో ప్రతిధ్వనించిన మోడీ సందేశం

#BJP Hujurnagar

ఆరు సంవత్సరాలుగా దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ సందేశాన్ని ఇంటింటికి చేర్చే బాధ్యతను సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో బిజెపి కార్యకర్తలు చేపట్టారు.

గురువారం ఉదయం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ పరిపాలన 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన సాధించిన విజయాలు ప్రజలకు వివరించారు. ప్రజలు సహకరించిన విధానాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోడీ రాసిన బహిరంగ లేఖను ప్రజలకు అందచేశారు.

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేళ్లచెరువు గ్రామంలో ఇంటింటికి లేఖ పత్రాలు పంచుతూ, వారి  అభిప్రాయాలు సేకరిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో సాముల సైదిరెడ్డి, అనుముల ఫణీంద్ర , కర్నాటి ఎరికల్ రెడ్డి, బంగారు రిషి, చారి , ఉప్పతల  గోపిరాజు, సుంకర నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎం.పి.పి అరెస్ట్: పోలీస్ స్టేషన్ కు తరలింపు

Satyam NEWS

కొత్త కొలువులు వెతుక్కున్న పాతకాపులు

Satyam NEWS

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

Bhavani

Leave a Comment