తిరుపతి లోక్ సభ స్థానానికి బిజెపినే అభ్యర్ధిని నిలబెట్టనున్నది. ఈ మేరకు నేడు బిజెపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య ఒప్పందం కుదిరింది.
బిజెపి ఏకపక్షంగా అభ్యర్ధిని నిర్ణయించుకుంటున్నదని కినుక వహించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంత కాలం బిజెపి అభ్యర్ధి పోటీ కి అంగీకరించలేదు.
దాంతో చాలా కాలంగా విషయం పెండింగ్ లో ఉంది. తాజాగా జరిగిన సమావేశంలో ఈ మేరకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.
గతంలో తిరుపతి లోక్ సభ కు ఎన్నికలు జరిగినప్పుడు బిజెపి కన్నా జనసేనకే ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయినా ఇప్పుడు బిజెపికే ఆ స్థానాన్ని ఇచ్చేందుకు జనసేన అంగీకరించింది.