38.2 C
Hyderabad
April 25, 2024 13: 08 PM
Slider మెదక్

బీజెపీ విజయానికి పునాది వేసిన ప్రజా సంగ్రామ పాదయాత్ర

#kolanshankarreddy

ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతా ఉంటే కాంగ్రెస్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని భవిష్యత్తులో బీజెపీ విజయానికి పునాదిగా మారుతోందని,  బీజెపి రాష్ట్ర నేత ,మాజీ సింగల్‌విండో చైర్మన్‌ కొలను శంకర్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వాగ్దానాలు  ఏడు సంవత్సరాల కాలంలో 5 వేల మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైందని,  బీజెపి కిసాన్‌ మోర్చా అధ్యక్షులు, ఎంపి, రాజ్‌కుమార్‌ చహార్‌ అన్నారు. బీజేపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి, ప్రజా సంగ్రామ రధ సారధి బండి సంజయ్‌ కుమార్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ పాద యాత్ర 32 రోజులు పూర్తయిన సందర్బంగా సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్రలో ముఖ్య అతిధులుగా పాల్గొని బండి సంజయ్‌తో కలిసి  పాదయాత్ర చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రం నరేంద్రమోడీ నాయకత్వంలో సకల జనుల ప్రజలకు అనుకూలంగా పనిచేస్తోందన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిదిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.

కార్యక్రమంలో డాక్టర్‌ మనోహర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, నిరంజన్‌రెడ్డి, కిసాన్‌ మోర్చా నాయకులు పడమటి జగన్మోహన్‌రెడ్డి, పాపయ్యగౌడ్‌, గోలి మధుసూధన్‌, అంజయ్య, రామ్‌రెడ్డి, మైపాల్‌రెడ్డి, రాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిరుత్సాహం వద్దు భవిష్యత్తు మనదే

Satyam NEWS

ఆప్ సంచలన నిర్ణయం: ప్రముఖుల భద్రత ఉపసంహరణ

Satyam NEWS

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంగనా రనౌత్

Satyam NEWS

Leave a Comment