జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బలం పై ఆధారపడి గెలవలనుకోవడం బీజేపీ వారి బలహీనత తెలియజేస్తున్నదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతి లో శుక్రవారంనాడు ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
నవతరం పార్టీ గాజు గ్లాసు గుర్తు కు ఓటేయాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేసారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ నవతరం పార్టీ కి కేటాయించిన గ్లాసు గుర్తును ఈసీ వద్దకు వెళ్లి రద్దు చేయించలేక బిజెపి నేతలు భంగపడి వచ్చారన్నారు.
డాక్టర్ గోదా రమేష్ కుమార్ అభ్యర్థి గా గ్లాసుగుర్తు పై గెలుస్తారని, బీజేపీ ని ఓడిస్తామని తెలిపారు. అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ మాట్లాడుతూ బీజేపీ మాయమాటలు నమ్మొద్దని గ్లాసుగుర్తు పోటీలో ఉందని తెలిపారు. తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
ప్రచారం లో సొంగా రత్నమ్మ, బత్తుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.