40.2 C
Hyderabad
April 19, 2024 17: 24 PM
Slider ముఖ్యంశాలు

బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్ర రెడ్డి మృతి బాధాకరం

#bjp andhrapradesh

భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు చిలకం రామచంద్ర రెడ్డి అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరమపదించారు. ఆయన మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి  దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్రంలోని కీలకమైన పదవులలో పనిచేసి రాయలసీమ అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డారు.

తాగు, సాగు నీటికోసం చిలకం రామచంద్ర రెడ్డి చేసిన పాదయాత్ర, వారి కృషి మరువలేనిదని, వారి మరణం భారతీయ జనతా పార్టీకే కాక, తెలుగు రాష్ట్రాలకు  తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మధ్య కాలంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్ సమయంలో చిలకం రామచంద్ర రెడ్డి తో ఫోన్ మాట్లాడడం జరిగింది. రేపు తిరుపతి సమీపాన వారి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Related posts

ఒక సమాజంగా మనం విఫలమవుతున్నాం

Satyam NEWS

పెద్ద పెద్ద షాపుల‌పై రెవిన్యూ,పోలీసులు యంత్రాంగం దృష్టి

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కొరకు అందరం కలిసి శ్రమిద్దాం

Satyam NEWS

Leave a Comment