భారత రత్న డా.బీ ఆర్ అంబేద్కర్ కు మేడ్చల్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు మాధవరం కాంతారావు ఘన నివాళి అర్పించారు.
అంబేద్కర్ 130 వ జయంతి సందర్బంగా హైదరాబాద్ బాలానగర్ లో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి మాధవరం కాంతారావు ఘన నివాళి అర్పించారు.
మహానియుడికి ఘనంగా నివాళులు అర్పించిన ఆయన మాట్లాడుతూ నవ భారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేద్కర్ అని అన్నారు.
సర్వ సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు బాబాసాహెబ్, భారత సమాజానికి అత్యున్నతమైన న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయనేత సంఘ సంస్కర్త రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు అంబేద్కర్ అని తెలిపారు.