ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాదీవెన పాదయాత్ర చేపట్టిన భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ త్వరగా కోలుకోవాలని ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు.
నేడు ఆయన ఈటెల రాజేందర్ ను హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో కలిసి పరామర్శించారు.
ఈటెల రాజేందర్ పాదయాత్ర సందర్బంగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
ఈటెల రాజేందర్ త్వరగా కోలుకోవాలని, ప్రజా జీవితంలో మళ్లీ చురుకుగా పాల్గొనాలని పాయల్ శంకర్ కోరారు.