భారతీయ జనతా పార్టీ నాయకులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రజాసమస్యలపై గళమెత్తుతున్న బిజెపి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కల్వకుర్తి ఎత్తిపోతల రిజర్వయర్ మోటర్ పుంపు పరిశీలించడానికి వెళ్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, బంగారు శృతి, శ్రీవర్ధన్ రెడ్డి, పవన్ కుమార్ లను పెబ్బేరు పోలీసులు అడ్డుకున్నారు.
తామేమీ సంఘ విద్రోహ శక్తులంకామని, ప్రాజెక్టు సందర్శిస్తే తప్పేంటని వారు ప్రశ్నించినా పోలీసులు పట్టించుకోలేదు.
పోలీసులతో వాగ్వాదానికి దిగిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.