కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో బిజెపి నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. పేద ప్రజల పై వేస్తున్న పన్నులను కేసీఆర్ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఈరోజు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉండగా ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేశారు.
కెసిఆర్ సీఎం అయిన తర్వాత ఇప్పటివరకు ధర్నాలు రాస్తారోకోలు చేయనివట్లేదని బిజెపి నాయకులు అన్నారు. ప్రశ్నించే గొంతు ను తొక్కేసి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో అన్యాయాలు అక్రమాలు, దోపిడీలు చేస్తున్నారని అన్నారు. ఎవరు ధర్నాలు రాస్తారోకోలు చేయకుండా, ప్రశ్నించ కూడదనే ఇలా చేస్తున్నారని వారు అన్నారు.
ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా తమను అరెస్టు చేశారని బిచ్కుంద బీజేపీ, బీజేవైఎం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కిష్ణారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు చెట్టు శెట్టిపల్లి విష్ణు, బిజెపి ప్రధాన కార్యదర్శి పత్తి రమేష్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి తోటవార్ సందీప్, పాల్గొన్నారు.