నేతలు ప్రగతి భవన్ను ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు పలువురు భాజపా నేతలను గృహనిర్బంధం చేశారు.
ఎమ్మెల్సీ రామచందర్రావు, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, ఇతర నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
పోలీసుల తీరుపట్ల భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహనిర్బంధం చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఎమ్మెల్సీ రామచందర్రావు విమర్శించారు.
దుబ్బాకలో భాజపా గెలిచే అవకాశాలు మెండుగా ఉండటంతోనే తెరాస ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిందేనని డీకే అరుణ స్పష్టం చేయగా.. ఇంటి నుంచి బయటకి రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో డీకే అరుణ నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.