హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ డీసీపీ కార్యాలయం ముందు బీజేపీ మహిళ మోర్చా నాయకుల ఆందోళన నిర్వహించారు. డీసీపీ ఆఫీస్ ముందే బైఠాయించి నిరసన తెలిపారు మహిళ నేతలు.
కాగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు కార్పొరేటర్ ఆమె అనుచరుల మధ్య జరిగిన గొడవలో మహిళ కార్పొరేటర్ ను అసభ్యంగా దూషించిన సమయంలో ఉన్న సాక్షులపై పోలీసులు ఎస్సి ఎస్టీ కేసు పెట్టడంపై ఎల్బీనగర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు.
మహిళ నాయకురాలిపై టిఆర్ఎస్ నాయకుల దాడిని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఇదే విషయంలో ఫిర్యాదు బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో డీసీపీ కి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ మోర్చా నాయకులను ఆఫీస్ గేటు వద్ద అడ్డుకోవడంతో బైఠాయించి ధర్నా చేసారు.