హైదరాబాద్ బండ్లగూడలోని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదాధికారుల తొలి రోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నేతలనుద్దేశించి కరీంనగర్ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిశా నిర్దేశం చేసారు. ఈ సమావేశానికి శాసనసభా పక్ష నేత రాజాసింగ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, తమిళనాడు రాష్ట్ర సహా ప్రభారి పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, జి.వివేక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్సులు శ్రీనివాసులు, దుగ్యాల ప్రదీప్ కుమార్, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి సీనియర్ నేతలు ఇంద్రసేనారెడ్డి, ఎంపీ సోయం బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
previous post