బిజెపి గొల్నాక డివిజన్ గంగానగర్ శక్తి కేంద్ర బూత్ ససక్తీకరణ సమావేశం శ్రీ మహంకాళి దేవాలయం, గంగానగర్లో శక్తి కేంద్ర ప్రముఖ్ సంగీతం రాజేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొని మార్గదర్శనం చేయడం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, అంబర్పేట్ అసెంబ్లీ పాలక్ శ్రీ ఎన్. శ్రీవర్ధన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఎం.శ్యామ్ రాజు శక్తి కేంద్రం సహ ప్రముఖ్ బి. ఈశ్వరరావు, పోలింగ్ బూత్ అధ్యక్షులు సావిత్రి, సాయి గణేష్, కిషోర్ మరియు సీనియర్ బిజెపి నాయకులు ఆర్.కే.రామచందర్ పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్