33.2 C
Hyderabad
April 26, 2024 01: 10 AM
Slider మెదక్

ప్రజల ప్రాణాల కంటే కెసిఆర్ కు ఎన్నికలే ముఖ్యం

#MPSoyamBapurao

రాష్ట్రంలో కరోనా మహమ్మారి తో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఎంపీ సోయం బాపురావు అన్నారు.

సిద్దిపేట ఎన్నికల ప్రచారానికి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎంపీ సోయం బాబూరావు సోమవారం సిద్ధిపేట లోని పలు వార్డుల్లో తిరుగుతూ బిజెపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.

రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక ఆక్సిజన్ కొరతతో ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే బస చేస్తూ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కేంద్రం పేదలకోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిధులు మంజూరు చేస్తే వాటిని దారి మళ్లించి టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.

దుబ్బాక ఎన్నికల ఫలితాలే సిద్దిపేటలో ఉంటాయని బిజెపి మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని అన్నారు.

సిద్దిపేటలో బీజేపీ గెలిస్తే అమృత్ యోజన పథకం కింద ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం లో ఆకట్టుకున్నవయోలిన్ కచేరీ

Satyam NEWS

పలాసలో వైసీపీ దురాగతాలు సాగనివ్వం

Satyam NEWS

సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలు

Murali Krishna

Leave a Comment