38.2 C
Hyderabad
April 25, 2024 14: 52 PM
Slider చిత్తూరు

ఆంధ్రాకు ద్రోహం చేసిన బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించండి

#NavataramParty

ఆంధ్రా కు ద్రోహం చేసిన బీజేపీ ని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో చిత్తు చిత్తుగా ఓడించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా ఆయన నేడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.

ఆయనతో బాటు తిరుపతి లోక్ సభ నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ సొంగా రత్నమ్మ, కార్యదర్శి బత్తుల అనిల్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా గాజు గ్లాసు గుర్తు కు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా విషయం మర్చిపోయిన బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీ ప్రకటించడాన్ని పాచిపోయిన లడ్డూ అని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించిన విషయాన్ని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గుర్తు చేశారు.

ప్రత్యేక హోదాను మర్చిపోయి పాచిపోయిన లడ్డులు వంటి ప్యాకేజీ ప్రకటించిన బీజేపీ ని ఓడించేందుకే తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తు కు ఓటు వేయాలని ఆయన కోరారు.

గత ఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని పవన్ కల్యాణ్ కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

బీజేపీ హఠావో, ఆంధ్రా కో బచావో అని పిలుపునిచ్చే రోజు వచ్చిందని జనసేనను అడ్డం పెట్టుకుని బీజేపీ గెలవాలని కలలు కన్న బీజేపీ ఆశను నవతరం పార్టీ భగ్నం చేస్తుందని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.

Related posts

దేవరకొండ టీఆర్ఎస్ నూతన కమిటీ నియామకం

Satyam NEWS

యోగి ఆదిత్యనాథ్ కు అయోధ్యలో ఆలయం

Satyam NEWS

అమితాబ్ వాయిస్ తో అయోధ్య రామాలయంపై చలనచిత్రం

Satyam NEWS

Leave a Comment