39.2 C
Hyderabad
April 25, 2024 15: 28 PM
Slider ముఖ్యంశాలు

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న బిజెపి

#Mallu Bhatti

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే రీతిలో ప్రవర్తిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ గోవా, మధ్యప్రదేశ్, మణిపూర్, ఇవాళ రాజస్థాన్ రాష్ట్రాలలో బిజెపి రాజకీయ కుట్రలకు తెర లేపిందని మండిపడ్డారు. రాజస్థాన్ గవర్నర్ ఢిల్లీకి దాసోహం అయ్యారని ఆయన ఆరోపించారు.

ఢిల్లీ నేతల డైరెక్షన్‌లో రాజస్థాన్‌లో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యాన్నీ కాపాడాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉందన్నారు. రాజ్యాంగంలో ఉన్న 10వ షెడ్యూల్‌ను కాపాడుకుందామని సేవ్ డెమోక్రసీ, సేవ్ కానిస్టిట్యూషన్ నినాదంతో ముందుకు వెళతామని మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. 

Related posts

నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్ ఇది

Satyam NEWS

క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో సిబిఐటి విద్యార్ధులు

Satyam NEWS

ఆదరణ పనిముట్లు… అమ్ముకున్నారు… వదిలేశారు..

Satyam NEWS

Leave a Comment