భారతీయ జనతా పార్టి మేడ్చల్(అర్బన్)జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ చంద్రరెడ్డి పిలుపు మేరకు ఈరోజు బాలాజీ నగర్ 115 డివిజన్ అధ్యక్షుడు జి.వినోద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పలు కాలనీ సమస్యలపై బిజెపి పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు.
కార్యక్రమంలో భాగంగా కె.పి.హెచ్.బి రోడ్ నంబర్-1 లోని జి.హెచ్.యం.సి పార్క్ వినియోగానికి కాలనీ వాసులు నుండి అక్రమంగా వసూళ్లు చేస్తున్న అధికారులను మీడియా ముఖంగా నిలదీస్తూ బేషరతుగా అక్రమ వసూళ్లను నిలిపివేయాలని అదేవిధంగా పార్క్ సమయాన్ని కూడా పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి 115 డివిజన్ అధ్యక్షుడు వినోద్ గౌడ్ గారితో పాటు బిజెపి నాయకులు కుమారస్వామి, గున్నాల వినోద్, గోపాల్ నాయక్, వెంకటేశ్వర్ రెడ్డి, మురళీకృష్ణ, జగదీష్, సాయిప్రసాద్, పురుషోత్తం, మహేష్, ఆకుల రాము, మురళి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.