39.2 C
Hyderabad
March 29, 2024 15: 45 PM
Slider ఆదిలాబాద్

ఆదివాసీల బాధలు తీర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

#BJPSirpur

పోడు భూములకు పట్టాలు ఇస్తానని మోసం చేసింది టి.ఆర్.ఎస్ ప్రభుత్వమని కొమరం బీమ్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి కొత్త పల్లి శ్రీనివాస్ అన్నారు. ఆది ఆదివాసీల జీవన విధానాన్ని మార్చడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండి పడ్డారు.

మంగళవారం జిల్లాలో జరిగిన జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఫారెస్ట్ అధికారులపై మండిపడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. టైగర్ జోన్ లో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని ఆయన అన్నారు.

పులి దాడిలో ఇద్దరు ఆదివాసి బిడ్డలు చనిపోతే అధికారులు, ఎమ్మెల్యే ఆర్థిక సాయం చేసి తూ తూ మంత్రంగా చేతులు దులుపుకున్నారని ఆయన అన్నారు.

కొమురం భీం జిల్లాలో ఆదివాసి కుటుంబాలను ఆదుకోవడంలో ఎంపీ సోయం బాబూరావు నాయకత్వంలో బిజెపి తీవ్రంగా కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో  జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్ , దహేగం మండల అధ్యక్షులు రాంటెంకి సురేష్ , బజ్జుర్ మండల అధ్యక్షులు సోయం చిన్నన, తిరుపతి, మెడి కార్తిక్ ,మాచర్ల శ్రీనివాస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర సాధన కోసం  ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు

Satyam NEWS

జైలు డిప్యూటీ సూపరిండెంట్ చింతల దశరథం బదిలీ

Murali Krishna

నేచుర‌ల్ స్టార్ నాని రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్ `ఫిఫిఫీ…ఫిఫీ..ఫి

Satyam NEWS

Leave a Comment