సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదంతో రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాది గడచిన సందర్భంగా ఇంటింటికి ప్రధాని నరేంద్ర మోడీ సందేశం అనే కార్యక్రమాన్ని కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో విస్తృతంగా జరుగుతున్నది. నియోజకవర్గం బిజెపి ఇన్ చార్జి డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రధాని రాసిన లేఖలను ప్రజలకు పంపిణీ చేశారు.
నేడు దహెగం మండలంలో రాంటెంకి సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంటింటికి ప్రధాన మంత్రి సందేశం కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా చేపడతామని ఈ సందర్భంగా బిజెపి నేతలు తెలిపారు. నరేంద్రమోడీ విజయవంతంగా రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకుని దేశాభివృద్ధికి పాటుపడ్డారని డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ రాసిన లేఖలను ఆయన వ్యాపారస్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పులగం నారాయణ, సాయి, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.