ఇంటింటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశం కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా రాజంపేట మండలంలోని తాళపాక గ్రామంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి, మాజీ టిటిడి బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి మోడీ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు వివరాలకు సంబంధించిన కరపత్రాలను మొదటగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరించారు. అనంతరం తాళ్లపాక గ్రామ ప్రజలకు ఇంటింటికి వెళ్లి గత సంవత్సర కాలంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విషయాల గురించి వివరించారు.
అయోధ్యలో రామాలయం నిర్మించటం, 370 ఆర్టికల్ రద్దు విషయం, covid-19పై చర్యలు తీసుకోవడం, ప్రజలకు ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీ, ప్రజలకు జనధన్ ఖాతాల్లో ప్రజలకు డబ్బులు వేయడం మోడీ సాధించిన విజయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ పోతుగుట రమేష్ నాయుడు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వై. సురేష్ రాజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. విజయేంద్ర బాబు పాల్గొన్నారు.
ఇంకా పి. మస్తానయ్య బిజెపి పట్టణ అధ్యక్షులు ఎం వెంకట సుబ్బయ్య నాయుడు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పట్టుపోగుల ఆదినారాయణ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి హరిప్రసాద్ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సలాం బిజెపి జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సుబ్రహ్మణ్యం బిజెపి మాజీ మండల అధ్యక్షులు పి పాపయ్య బిజెపి మహిళా నాయకురాలు కళావతి సుబ్బయ్య రాజగోపాల్ నాయుడు తాళపాక గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.