27.7 C
Hyderabad
March 29, 2024 01: 53 AM
Slider నెల్లూరు

నీతి నిజాయితీతో పరిపాలిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ

#Venkatagiri

దేశంలో గత 7 సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ బిజెపి ఇంచార్జి ఎస్. ఎస్.ఆర్ నాయుడు అన్నారు.

నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన వెంకటగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

రాపూరు మండలంలోని సీనాయిపాలెం ఎస్సీ కాలని, సైదాపురం మండలం లోని సిద్దలయ్యకోన, డక్కిలి, మార్ల గుంట గిరిజన కాలనీ, వెంకటగిరి రూరల్ మండలం లోని జంగాలపల్లి   ప్రాంతాలలో ఆయన పర్యటించి కరోనా నివారణకు మాస్కులు, శానిటైజర్ లు పంపిణీ చేశారు.

అనేక పథకాల పేరుతో కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నప్పటికీ… రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దుర్వినియోగం చేస్తూ, ఆ పథకాలు తమవిగా వక్రీకరిస్తూ కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారన్నారు. దేశంలో అవినీతి లేకుండా… నీతి నిజాయితీగా పరిపాలిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నరేంద్ర మోడీ నే అని నాయుడు అన్నారు.

ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వెంకటగిరి నియోజకవర్గం లోని గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు.

ఈ కార్యక్రమాలలో ఎస్ ఎస్ ఆర్ నాయుడుతో పాటు రాపూరు మండల ప్రధాన కార్యదర్శి  వెంకట రత్నం, జిల్లా కార్యదర్శి ప్రశాంత్, సీనియర్ నాయకులు చాంద్ బాషా, దక్కిలి బిజెపి మండల అధ్యక్షులు బాలకృష్ణయ్య నాయుడు, బిజెపి వెంకటగిరి రూరల్ మండల అధ్యక్షులు వడ్డీ శివకోటి, ఉపాధ్యక్షులు వెంకటరత్నం,  ఇంకా ఆయా ప్రాంతాల స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వెంకటగిరి సామాన్యుడు

Related posts

పూరిళ్ళున్న చోటే జగనన్న ఇల్లు కట్టాలి: సీపీఎం

Satyam NEWS

సాడ్ :హైతీ లో అగ్ని ప్రమాదం 15 మంది చిన్నారుల మృతి

Satyam NEWS

కేసీఆర్ కుమార్తె కవిత అలిగి అమెరికా వెళ్లిందా

Satyam NEWS

Leave a Comment