తెలంగాణ రాష్ట్రం సాధన కోసం నాడు అరెస్ట్ అయ్యాము నేడు కేసీఆర్ నయా నైజాం కుటుంబ పాలన అనంతం మోదించే వరకు ఎన్ని అరెస్ట్ లను అయిన ఎదుర్కొంటాము అని మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి అన్నారు.
కూకట్ పల్లి కేపీ.హెచ్.బి పోలీస్ స్టేషన్ లో అనవసరంగా బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేయడం తో నిరసన వ్యక్తం చేశారు. హరీష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ నేతలను పోలీసులు ఎప్పుడు ఎందుకు అరెస్టు చేస్తున్నారు తెలియడం లేదు ఆరోపించారు.
భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు, మోర్చా నాయకులు ఎటువంటి కార్యక్రమానికి పిలుపు ఇవ్వక పోయినా ఉదయం ఐదు గంటలకు అరెస్టు పర్వానికి తెర లేపుతున్నారు. కెసిఆర్ దగ్గర ఉన్న ఇంటిలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలం చెందారని, ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగే అధికారులను పోలీసు వ్యవస్థలో పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరిగే హత్యాకాండ, అక్రమాలు, నిరసనలు, భూకబ్జాలు జరుగుతున్న సరైన ఇంటిలిజెన్స్ వ్యవస్థ లేకపోగా సరైన జ్ఞానము పరిజ్ఞానం లేని అధికారులు వ్యవస్థని నడుపుతున్నారు. ఇకనైనా కెసిఆర్ తన వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.