40.2 C
Hyderabad
April 24, 2024 17: 12 PM
Slider హైదరాబాద్

నిజాం పాలనను మరపిస్తున్న సిఎం కేసీఆర్ పాలన

#pannala harishreddy

తెలంగాణ రాష్ట్రం సాధన కోసం నాడు అరెస్ట్ అయ్యాము నేడు కేసీఆర్ నయా  నైజాం కుటుంబ పాలన అనంతం మోదించే వరకు ఎన్ని అరెస్ట్ లను అయిన ఎదుర్కొంటాము అని మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి అన్నారు.

కూకట్ పల్లి కేపీ.హెచ్.బి పోలీస్ స్టేషన్ లో అనవసరంగా బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేయడం తో నిరసన వ్యక్తం చేశారు. హరీష్ రెడ్డి మాట్లాడుతూ  జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ నేతలను పోలీసులు ఎప్పుడు ఎందుకు అరెస్టు చేస్తున్నారు తెలియడం లేదు ఆరోపించారు.

భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు, మోర్చా నాయకులు ఎటువంటి కార్యక్రమానికి పిలుపు ఇవ్వక  పోయినా ఉదయం ఐదు గంటలకు అరెస్టు పర్వానికి తెర లేపుతున్నారు. కెసిఆర్ దగ్గర ఉన్న ఇంటిలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలం చెందారని,  ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగే అధికారులను పోలీసు వ్యవస్థలో పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో జరిగే హత్యాకాండ, అక్రమాలు, నిరసనలు, భూకబ్జాలు జరుగుతున్న సరైన ఇంటిలిజెన్స్ వ్యవస్థ లేకపోగా సరైన జ్ఞానము పరిజ్ఞానం లేని అధికారులు వ్యవస్థని నడుపుతున్నారు. ఇకనైనా కెసిఆర్ తన వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

Related posts

కల్యాణమస్తు జంటలకు 2 గ్రాముల బంగారు తాళిబొట్లు

Satyam NEWS

జనవరి 1న భద్రాద్రిలో తెప్పోత్సవం, 2న ఉత్తర ద్వార దర్శనం

Bhavani

ఆవ ఎండోమెంట్ కాలనీలోని 54 మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి

Bhavani

Leave a Comment