39.2 C
Hyderabad
April 23, 2024 15: 14 PM
Slider ముఖ్యంశాలు

ఆస్తి పన్ను, చెత్త పన్నుపై బిజెపి తీవ్ర నిరసన

#VishnuvardhanReddy

కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాలి కానీ కొత్త పన్నులు వేస్తే ఎలా? ఈ ప్రశ్న ప్రతిపక్షాల నుంచి సామాన్య ప్రజల వరకూ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా వేస్తున్న ఆస్తి పన్ను, చెత్త పన్నులపై తీవ్ర ప్రజావ్యతిరేకత వచ్చింది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నది.

‘‘ముఖ్యమంత్రి  జగన్ గారు కరోనా సమయంలో కొత్త పన్నులా?’’ అంటూ బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ లో ప్రశ్నించారు.

వై యస్ ఆర్ పార్టీ ప్రభుత్వం మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో నూతన ఆస్తిపన్ను, చెత్త పై పన్ను పెంపుదలను విరమించుకోవాలని ఏపి బీజేపీ డిమాండ్ చేస్తుందని ఆయన అందులో పేర్కొన్నారు.

Related posts

60 సంవత్సరాలుగా సాధ్యం కాని సమస్యపై విజయం

Satyam NEWS

రైతుకు గిట్టుబాటు ధర ఇప్పించడమే లక్ష్యం

Satyam NEWS

భారత్ మాతాకీ జై అంటే అర్ధం తెలియని మంత్రి

Bhavani

Leave a Comment