భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేపు ఉ!! 10:30 నిమిషాలకు బిజెపి జిల్లా కార్యాలయం నుండి ర్యాలీగా కలెక్టరేట్ ముందు ధర్నా కు బయలుదేరడం జరుగుతుందని ఆమె తెలిపారు.
ఈ ధర్నాలో తమ ప్రధానమైనటువంటి డిమాండ్లను రైతుల కు రుణమాఫీ ఏకకాలంలో అమలు చేయాలి సన్నవరి పండించిన రైతులకు మద్దతు ధర 2500 ప్రకటించాలి టీచర్లకు, ఉద్యోగులకు న్యాయంగా దక్కాల్సిన ఐఆర్, పి.ఆర్.సి, సర్వీస్ రూల్స్ సమస్యలు వెంటనే తీర్చాలన్న డిమాండ్లతో ఈ ధర్నా ఉంటుందన్నారు.
బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆమె ప్రకటనలో కోరారు.