37.2 C
Hyderabad
April 18, 2024 22: 28 PM
Slider కరీంనగర్

ఫారెస్టు అధికారి హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడు

#bandisanjay

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని ఈర్లపూడికి చెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కస్తానని, కుర్చీ వేసుకుని పోడు రైతులకు పట్టాలిస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

ఈ మేరకు తన నియోజకవర్గంలో వేములవాడలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఫారెస్ట్ అధికారి హత్య, మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులపై స్పందించారు. ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు సీఎం కేసీఆర్ బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు సమస్యను పరిష్కరించకుండా కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నాడని… సీఎం కుట్రలకు అధికారులను బలి చేస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ నేతలకు నోటీసులతో బెదిరింపులకు దిగుతూ రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నాడని…. తన పదవిని కాపాడుకునే యత్నం చేస్తున్నాడని సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు ఆడుతున్న డ్రామా అని అన్నారు. లిక్కర్ స్కాంపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీఎం, ఆయన కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సొమ్మును దోచుకుని అడ్డంగా దోచుకుంటున్నరన్నారు.

ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ దాడులపై రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటు. ప్రజలను రాచి రంపాన పెట్టి అడ్డగోలుగా, అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్లను కంట్రోల్ చేయాలా? వద్దా?… రాజకీయ విమర్శలు చేసే వాళ్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమార్కులను పార్టీలకు అపాదించడం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. అక్రమార్కుల మీద దాడులు చేస్తే అడ్డుకోవడమేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. అధికారులు తనిఖీలు చేస్తే నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఉందన్నారు.

అది చేతగానివాళ్లే బూతులు తిడుతూ దాడులు చేస్తూ రాజకీయ రంగు పులుమతారని ఆరోపించారు. అవినీతి తిమంగలాలను వదిలిపెట్టాలా?  అవినీతి పరులు తప్పించుకోవడానికి ఏదో ఒక విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. బీజేపీ ఎంపీపైనా కూడా దాడులు చేశారు కదా… వాటికి పార్టీలతో పనిలేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అన్నారు.

Related posts

బాధిత కుటుంబానికి టీఎస్‌ఆర్టీసీ భ‌రోసా

Bhavani

టిడ్కో లబ్దిదారులకు అన్యాయం చేస్తే ఉద్యమం

Satyam NEWS

బలహీన వర్గాల వారిపై కక్ష కట్టిన వై ఎస్ జగన్

Satyam NEWS

Leave a Comment