28.2 C
Hyderabad
April 20, 2024 12: 24 PM
Slider జాతీయం

రిటర్నింగ్ అధికారిని చంపుతామని బిజెపి భయపెట్టింది

#mamatabenarjee

నందిగ్రామ్ లో రిటర్నింగ్ అధికారిని బిజెపి వాళ్లు భయపెట్టారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.

రీకౌంటింగ్ కు ఆదేశాలు ఇస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితులు కల్పిస్తామంటూ ఆయనను బెదిరించారని మమత అన్నారు.

దాంతో ఆయన రీ కౌంటింగ్ కు ఆదేశాలు ఇవ్వలేకపోయారని మమతా బెనర్జీ తెలిపారు.

కౌంటింగ్ పూర్తి కాగానే తాను గెలిచినట్లు ప్రకటించిన అధికారులు ఆ తర్వాత ఫలితాన్ని నిలిపివేశారని మమత అన్నారు.

నాలుగు గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేశారని ఆ తర్వాత ఫలితం తనకు వ్యతిరేకంగా ప్రకటించారని మమత తెలిపారు.

ప్రజల తీర్పును తాను గౌరవిస్తానని అయితే ప్రజల తీర్పును మారిస్తే ఎలా అని ఆమె ప్రశ్నించారు. నందిగ్రామ్ ఎన్నికల ఫలితంపై కోర్టును ఆశ్రయిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

Related posts

వరదకు కొట్టుకుపోయిన సోదరుల్లో ఒకరి మృతదేహం లభ్యం

Satyam NEWS

కాలచక్రం

Satyam NEWS

ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మావతి

Satyam NEWS

Leave a Comment