గుంటూరు జిల్లా తెనాలి లో బీజేపీ ప్రజాపోరు ప్రచార రథాన్ని తగలపెట్టడం పిరికిపంద చర్య అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెనాలిలో అర్ధరాత్రి బిజెపి ప్రజా పోరు రథం తగలబెట్టినంత మాత్రాన ప్రజల హృదయాల్లో ఉన్న బీజేపీని, నరేంద్రమోడీని ప్రజల నుంచి దూరం చేయలేరని ఆయన అన్నారు. ఇది పిరికిపంద చర్య, సంఘటనకు పాల్పడిన వ్యక్తులు మీద కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆయన కోరారు. అధికార పార్టీ నేతలు పోలీసుల ఐపీసి ని వైసిపీ గా మార్చారని ఆయన అన్నారు. కొందరు పోలీసులు అనుసరిస్తున్న తీరు సిగ్గు చేటని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బీజేపీ ని నైతికం గా దెబ్బ తీయాలని కొందరు కుట్ర చేస్తున్నారని, బీజేపీ సభలు కు వస్తున్న వారికి సంక్షేమ పధకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన అన్నారు.