40.2 C
Hyderabad
April 19, 2024 16: 49 PM
Slider తూర్పుగోదావరి

ప్రజాపోరు రథాన్ని తగులబెట్టడం పిరికిపంద చర్య

#vishnuvardhanreddy

గుంటూరు జిల్లా తెనాలి లో బీజేపీ ప్రజాపోరు ప్రచార రథాన్ని తగలపెట్టడం పిరికిపంద చర్య అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెనాలిలో అర్ధరాత్రి బిజెపి ప్రజా పోరు రథం తగలబెట్టినంత మాత్రాన  ప్రజల హృదయాల్లో ఉన్న బీజేపీని, నరేంద్రమోడీని ప్రజల నుంచి దూరం చేయలేరని ఆయన అన్నారు. ఇది పిరికిపంద చర్య, సంఘటనకు పాల్పడిన వ్యక్తులు మీద కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆయన కోరారు. అధికార పార్టీ నేతలు పోలీసుల ఐపీసి ని వైసిపీ గా మార్చారని ఆయన అన్నారు. కొందరు పోలీసులు అనుసరిస్తున్న తీరు సిగ్గు చేటని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బీజేపీ ని నైతికం గా దెబ్బ తీయాలని కొందరు కుట్ర చేస్తున్నారని, బీజేపీ సభలు కు వస్తున్న వారికి సంక్షేమ పధకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన అన్నారు.

Related posts

8వ తేదీన పెద్దింటి అశోక్ ‘లాంగ్ మార్చ్’ పరిచయం

Satyam NEWS

పోలీస్ ఎలర్ట్: బైక్ చోరీల అంతర్ జిల్లా ముఠా అరెస్ట్

Satyam NEWS

పాఠశాల స్వచ్ఛ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలి

Satyam NEWS

Leave a Comment