ఆయుష్మాన్ భారత్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి అన్నారు.
ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేయాలని బీజేపీ వివిధ మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం పై చేసిన ఒత్తిడి ఫలించిందని అన్నారు.
ఆయుష్మాన్ భారత్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో ఆలస్యంగా నైనా రాష్ట్ర ప్రభుత్వ మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు.
అదేవిధంగా ఆరోగ్య శ్రీ లో కరోనాను చేర్చాలన్న తమ డిమాండ్ కూడా నెరవేర్చాలని ఆయన కోరారు. ఆరోగ్య శ్రీ కవరేజీని రూ.5 లక్షల కు పెంచాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఒకవేళ ఆరోగ్యశ్రీ లో కరోనాను చేర్చ కుండా రాష్ట్ర ప్రభుత్వం మొండికేస్తే తమ ఉద్యమ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.