34.2 C
Hyderabad
April 19, 2024 20: 25 PM
Slider రంగారెడ్డి

ప్రతి కార్యకర్తకు బీజేపీ అండగా ఉంటుంది: వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

#vijayashanti

తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో కూకట్ పల్లి నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 500 మంది యువకులు ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వర్ రావు వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు 500 మంది యువత బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీలో చేరిన వారందరికీ పార్టీ సముచిత స్థానం లభిస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్తకు బీజేపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు, ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు యువతను ఆలోచింపజేస్తున్నాయని వడ్డేపల్లి తెలిపారు. దీంతో తెలంగాణలో కూడా మెజారిటీ యువత బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్యానించారు.

గత తొమ్మిదేళ్ల మోదీ పాలనలో మన దేశం అభివద్ధిలో దూసుకుపోతుందన్నారు. బీజేపీ పాలనలోనే భారత్ విశ్వ గురువుగా అవతరించిందని గుర్తు చేశారు. ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లినా భారతీయులంటే ఒక ప్రత్యేక గౌరవం లభించే స్థాయికి మన దేశం చేరుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికీ మెజారిటీ భారతీయులంతా మోదీ వెంటే ఉన్నారని వడ్డేపల్లి పునరుద్ఘాటించారు. బీజేపీ పాలనలోనే దేశం భద్రంగా ఉంటుందనే భరోసా ప్రతి భారతీయుడిలో ఉందన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలిపించి మరోసారి మోదీని ప్రధాని పీఠం మీద కూర్చొబెట్టాలని ప్రజలు భావిస్తున్నారని జోస్యం చెప్పారు.

బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నట్లు గానే మన తెలంగాణలో అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే మన రాష్ట్రంలో కూడా బీఆరెస్ పార్టీ దౌర్జన్యాలు, రాక్షస పాలనకు చరమగీతం పాడాలని ప్రజలు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారని రాజేశ్వర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ప్రజల్లోకి మరింత దూసుకుపోతోందన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీని గెలిపించి డబుల్ ఇంజన్ సర్కార్ ను నెలకొల్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూకట్ పల్లిలో నియోజకవర్గంలో కూడా మెజారిటీ ప్రజలు బీజేపీ వైపే ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడించారు. రానున్న రోజుల్లో మన నియోజకవర్గంలో మరిన్ని పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. పార్టీ కోసం నిజాయతీగా పనిచేసేందుకు లక్షల మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వారితో చేతులు కలిపేందుకు మరింత మంది ముందుకు రావడం చాలా సంతోషకరమన్నారు. పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఏ సమయంలోనైనా అండగా ఉంటామని మరోసారి హామీ ఇచ్చారు.

Related posts

జర్నలిస్టుల మహాసభను  జయప్రదం చేయండి

Satyam NEWS

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు గుండెపోటు

Satyam NEWS

వ్యాయామం

Satyam NEWS

Leave a Comment