30.7 C
Hyderabad
April 24, 2024 00: 47 AM
Slider నల్గొండ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికే పట్టభద్రులు పట్టం కడతారు

#BJPNalgonda

తెలంగాణ ప్రభుత్వ పాలనకు విరక్తి చెందిన నియోజకవర్గ పట్టభద్రులు భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టడానికి సిద్ధమయ్యారని,రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్సీ ఎన్నిక   హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్  రవికాంతి ప్రదీప్ కుమార్  అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం అసెంబ్లీ కో- కన్వీనర్ బాల వెంకటేశ్వర్లు  అధ్యక్షతన  ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల  సమాయత్త సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రదీప్ మాట్లాడుతూ  అధోగతి పాలనతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను తీవ్ర మానసిక సంక్షోభంలోకి నెట్టివేశాడని అన్నారు.

అభివృద్ధి పాలనను గాలికొదిలి దోచుకోడానికి దారులు తీశారన్నారు. అమాయకులకు అండగా నిలిచిన బీజేపీ శ్రేణులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం  ప్రభుత్వ పతనానికి నిదర్శనం అన్నారు.నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేకుండా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు  సైతం పీఆర్సీ ఇవ్వకుండా  సాగిస్తున్న దుష్ట పాలనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చరమగీతం పాడి,  బిజెపికి పట్టం కట్టడానికి   మేధావులు,  పట్టభద్రులు సిద్ధమయ్యారని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేడులకు దిశా – నిర్దేశం చేశారు.  

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి గుండెబోయిన వీరబాబు,జిల్లా కార్యవర్గ సభ్యుడు నర్సింగ్ అంజయ్య,మండల పార్టీ అధ్యక్షుడు ప్రార్థనబోయిన విజయ్ కుమార్, కొత్తూరి వెంకటేశ్వర్లు,   కోటిరెడ్డి, సైదిరెడ్డి,లింగ రాజు,  ఎల్లయ్య,మేకల వెంకటేశ్వర్లు,  విజయ్ రెడ్డి,కుక్కడపు వెంకటేశ్వర్లు,గోపీ,లక్ష్మణ్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపిలో మధ్యాహ్నం 1 గంట వరకు బస్సులు బంద్

Satyam NEWS

అక్రమంగా పొలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితుల ఆందోళన

Satyam NEWS

మహిళతో పాటు ఏడుగురు మట్కా నిర్వాహకులు అరెస్టు

Satyam NEWS

Leave a Comment