38.2 C
Hyderabad
April 25, 2024 12: 53 PM
Slider కడప

బిజెపి ఆధ్వర్యంలో రాజంపేట అసెంబ్లీ స్థాయి శిక్షణ తరగతులు

#BJPRajampet

కడప జిల్లా  రాజంపేటలోని ఆర్వీ కళ్యాణమండపం లో శుక్రవారం   రాజంపేట బీజేపీ అసెంబ్లీ స్థాయి కార్యకర్తలందరికీ రెండురోజుల పాటు శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ పోతుకుంట రమేష్ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి  సీనియర్ నాయకులు చల్లపల్లి నర్సింహారెడ్డి వీహెచ్ పి రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రాముడు బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు  పాల్గొనే ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  రాష్ట్రవ్యాప్తంగా నోటా డెబ్బై అయిదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం నుంచి వంద మంది కార్యకర్తలతో యోగా శిక్షణా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని దానిలో భాగంగా శుక్రవారం, శనివారం రాజంపేటలో ఈ శిక్షణా తరగతులు జరుపుకోవడం చాలా శుభపరిణామమని అని  అన్నారు.

అలాగే రాబోయే రోజుల్లో పార్టీని పటిష్ట స్థాయికి తీసుకెళ్లడానికి రాబోయే ఎన్నికల్లో  అన్ని స్థానాల్లో పోటీ చేయాలని దానికి తగ్గట్టుగా  కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నట్టు తెలిపారు. జనతా పార్టీగా ఆవిర్భవించి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి ఎక్కువ సభ్యత్వం గల పార్టీగా  ఉన్నదని అన్నారు.

గత డెబ్బై సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలన్నీ, నరేంద్ర మోడీ  నాయకత్వంలో  ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ముందు ముందుకెళ్తున్నటువంటి గొప్ప పార్టీ అని  అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త కూడా దేశం మొదటి పార్టీ తర్వాత సెల్ఫ్ లాస్  నేషనల్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తుందనే అన్నారు ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు వాయిస్ సురేష్రాజు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పట్టుపోగుల ఆదినారాయణ

రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఏ.విజయేంద్ర బాబు భర్తల రాజేష్ మండల అధ్యక్షురాలు ప్రభావతి సిద్దవటం మండల అధ్యక్షుడు అమర్నాథ్ శర్మ సుండుపల్లి మండల అధ్యక్షుడు రామ జగదీష్ స్వామి వీర్నపల్లి మండల అధ్యక్షుడు నరేంద్ర  ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు బాలరాజు శివరాజు  రాజంపేట పట్టణ అధ్యక్షుడు ఎం వెంకట సుబ్బయ్య నాయుడు

మాజీ మండల అధ్యక్షులు పాపయ్య  మండల ప్రధాన కార్యదర్శి రాము మండల ఉపాధ్యక్షుడు నర్సింహరాజు డాక్టర్ రేణు ప్రసాద్ సుభద్ర  బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరిప్రసాద్  గంపా సుబ్బరాయుడు ఆంజనేయులు మల్లికార్జున పులి నరేందర్రెడ్డి  తదితరులు పాల్గొన్నారు

Related posts

సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న కేంద్ర‌మంత్రుల‌తో భేటీ

Sub Editor

ప్రకాశం బ్యారేజ్ కు కొనసాగుతున్న వరద

Bhavani

సమన్వయంతో ముందుకు సాగుదాం

Satyam NEWS

Leave a Comment