విజయవాడ నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రానికి అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పటికను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో పట్టుకున్నారు. విజయవాడ నుంచి సూర్యాపేటకు నల్లబెల్లం తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించగా సూర్యాపేటకు చెందిన లింగయ్య అనే వ్యక్తి బొలెరో వాహనంలో 1200 కిలోల నల్ల బెల్లంతో పాటు 100 కిలోల పటికను తరలిస్తుండగా పట్టుకున్నారు.
previous post