గోల్కొండ ప్రాంతంలో నిన్న రాత్రి నల్ల చిరుత కనిపించింది. అరుదుగా ఉండే ఈ నల్లచిరుత గోల్కొండ ప్రాంతంలోని ఫతేదర్వాజా ప్రాంతంలో కనిపించడంతో స్థానికులలో ఒక్క సారిగా భయాందోళనలు నెలకున్నాయి.
నూరానీ మసీదు వద్ద ఈ నల్ల చిరుత కనిపించినట్లు స్థానికులు చెప్పారు. అటవీ శాఖ అధికారులు నల్ల చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.