భద్రాచలంలోని అంబాసత్రంలో వేద , స్మార్త విద్యార్థులకు , బ్రాహ్మణులకు భద్రాచలం ఛాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్థానిక వ్యాపారస్తుల సహకారంతో మంచి 31 రగ్గులను బుధవారం పంపిణి చేశారు. ఇందులో 11 రగ్గులని ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీ కంభంపాటి సురేష్ కుమార్ తన తండ్రి స్వర్గీయ కంభంపాటి వెంకటేశ్వర్లు పేరు మీద వితరణగా అందించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అఫ్ కామర్స్ కార్యదర్శి కంభంపాటి సురేష్ కుమార్ , సీనియర్ జర్నలిస్ట్ కోన ఆనంద్ కుమార్ శర్మ , గీతాంజలి హోటల్ యజమానులు శ్రీనివాస్ , చిట్టిబాబు , పాలిటెక్నిక్ కాలేజీ సూరిబాబు , ఉప్పాడ.ప్రసాద రెడ్డి , ట్రావెల్స్ యజమాని శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు , బ్రాహ్మణులు వీరిని ఆశీర్వదించారు.
previous post
next post