నిరుపేద కుటుంబాలకు సాయం అందించడమే సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ధ్యేయమని సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ వ్యవస్థాపకులు,ములుగు, భుపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక (ఫైర్) స్టేషన్ ఎదురుగా గోదాం ప్రక్కన గుడారాలు వేసుకుని నివసిస్తున్న పేదలకు సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఉండటానికి సరైన ఇండ్లు లేక పరదాలతో గుడారాలు వేసుకుని నివసిస్తున్న వారి ఇబ్బందులను చూసిన తస్లీమా వారికి దుప్పట్లు అందజేశారు. శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. తస్లీమా మాట్లాడుతూ పేద ప్రజలకు సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ఆసరాగా ఉంటుందని తస్లీమా అన్నారు. ఆమె వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యులు ఉన్నారు.
previous post