మెగా సుప్రీమ్ స్టార్, సినీ నటుడు సాయిధరమ్ తేజ్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు గురువారం శ్రీకాకుళంలో రక్తదానం చేసారు. జిల్లా సాయిధరమ్ తేజ్ యువత ఆద్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని న్యూ బ్లడ్ బ్యాంక్ లో ప్రత్యేకంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ అభిమానులు స్వచ్చందంగా రక్తదానం చేసారు. తలసేమియాతో బాధపడుతున్న బాధితులకి డోనర్ కార్డులను అందజేసారు. అలాగే సాయిధరమ్ తేజ్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి నిరాడంబరంగా వేడుకలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను, శ్రీకాకుళం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు విశ్వక్ సేన్, ఉత్తరాంధ్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి వైశ్యరాజు మోహన్ లు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడాన్ని ప్రొత్సహిస్తున్న రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీనును శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ తరపున జ్ఞాపికను అందజేస్తూ సత్కరించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో జిల్లా సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షులు జోగిపాటి వంశీ, కిరణ్, మౌళి, కార్తీక్, ఖాదర్ ,రాజు,
రామ్ చరణ్ యువత అధ్యక్షులు తైక్వాండో గౌతమ్ ,చరణ్ ,వర్ధన్ సూరి,అంబేద్కర్ ,రమేష్ ,చంటి ,సంతోష్ ,టీం అల్లు అర్జున్ ప్రతినిధులు పుక్కళ్ళ నవీన్ , తాళాడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.