పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా వనపర్తిలోని సంఘం పంక్షణలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఖిల్లా ఘనపూర్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో యువత తో 20 మందితో స్వచ్చందంగా రక్తదానము చేయించారు. రక్తదానం చేయడం వల్ల మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది దానితో పాటు ఒకరి ప్రాణాల్ని కాపాడినవాళ్ళం అవుతామని తెలియచేసారు. కార్యక్రమంలో ఖిల్లాగణపురం మండలం నుంచి సోలిపూర్ సర్పంచ్ పద్మ గారు రక్తదానం చేయడం అందరికి స్ఫూర్తి దయాకం అని కొనియాడారు. కార్యక్రమం లో ఎసై వెంకటేష్ గౌడ్, సోలిపూర్ సర్పంచ్ పద్మ, బాలిశ్వర్ రెడ్డి, ఖిల్లా గణపురం యూత్ మధు,రమేష్, నరేష్ యువశక్తి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్. నెట్