36.2 C
Hyderabad
April 16, 2024 21: 53 PM
Slider ప్రత్యేకం

రక్తదానం చేసి ఒక తల్లిని కాపాడిన జర్నలిస్టు

#journalist

అత్యవసర పరిస్థితులలో రక్త దానానికి ముందుకు వచ్చిన ఒక జర్నలిస్టు ఒక తల్లిని కాపాడాడు.

వివరాలలోకి వెళితే ములుగు జిల్లా ఏరియా ఆస్పత్రిలో డెలివరీకి సిద్ధంగా వున్న ఒక మహిళకు అత్యవసరంగా “ఎ” పాజిటివ్ బ్లడ్ అవసరం అయింది.

విషయం ములుగు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీష్ కె చెప్పారు. అదే సమయంలో ఒక స్థానిక పత్రిక రిపోర్టర్ అయిన గట్టు ప్రశాంత్ ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు.

విషయం తెలుసుకున్న ప్రశాంత్ తనది “ఎ” పాజిటివ్ బ్లడ్ అని చెప్పి తానే రక్తదానం చేస్తానని ముందుకు వచ్చాడు.

మానవతా దృక్పథంతో అత్యవసర పరిస్థితులలో రక్త దానానికి ముందుకు వచ్చిన రిపోర్టర్ గట్టు ప్రశాంత్ ను ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ జగదీష్ అభినందించారు.

Related posts

ప్రీతి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన విచారణ జరపాలి

Murali Krishna

ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రోడ్లు డ్రైన్లు వేస్తాం

Bhavani

విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం                                    

Satyam NEWS

Leave a Comment