సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండలం ఎర్రగడ్డ తండాకు చెందిన గర్భిణీ స్త్రీ బి.కళ్యాణి కి రక్తం అవసరం అయింది. ఆమె భర్త నరహరి ఈ విషయాన్ని హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని డి.ఎస్.ఆర్.ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావుకు ఫోన్ ద్వారా విషయం తెలిపారు. తక్షణమే బాబురావు స్పందించి హుజూర్ నగర్ పట్టణం తిలక్ నగర్ కి చెందిన కోల్లపూడి వినయ్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు.
ఆయన వెంటనే వెళ్లి ‘ఓ’ పాజిటివ్ రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీకి రక్తదానం చేసి రెండు నిండు ప్రాణాలు కాపాడినందుకు కోల్లపూడి వినయ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానంపై అవగాహన కల్పిస్తూ యువతను ప్రేరేపిస్తూ రక్తదానం గొప్పదనాన్ని తెలియపరుస్తూ, అపోహలు తొలగిస్తూ ప్రతి మనిషి మానవత్వంతో రక్తదానం చేయాలని కోరారు.
బాధిత కుటుంబ సభ్యులు సకాలంలో రక్తదానం అందించిన డి.ఎస్. ఆర్.ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావుకు, వినయ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు దగ్గుపాటి సత్యానందం,చింతమల్ల ప్రసాద్, పొదిల తిరుపతి,కోల్లపూడి కళ్యాణ్, మామిడి అశోక్,దగ్గుపాటి సురేష్, దగ్గుపాటి కవిత,మామిడి రాజేష్, దగ్గుపాటి సుశీల,దగ్గుపాటి రాజేష్,కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్