కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ ఆధ్వర్యంలో ఉచిత రక్త హీనత శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఈ ఉచిత రక్తహీనత శిబిరం ఏర్పాటు చేయగా దాన్ని ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ చైర్మన్ డాక్టర్ కొత్తపల్లి అనిత ప్రారంభించారు.
ఈ శిబిరంలో 65 మందికి పరీక్షలు నిర్వహించారు. వారికి కావల్సిన మందులు అందించి వ్యాధి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు.
అదేవిధంగా వారు మాట్లాడుతూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా కూడా ఇలాంటి శిబిరాన్నే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నేటి నుంచి 8వ తేదీ వరకూ సిర్పూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉచిత రక్తహీనత శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ అవకాశాన్ని మహిళలు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చెర్మెన్ డా.జ్యోతి , డా.ఉదయభాను, డా.రమాకాంత్, డా.హసీబీ ఉల్ హుక్, డా.సత్యనారాయణ కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.